కృష్ణా: మొవ్వ మండలం మొవ్వపాలెం గ్రామంలో యూరియా కోసం రైతులు వినూత్నంగా క్యూలైన్ ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం ఉదయం 6:30 గంటలకే కో–ఆపరేటివ్ బ్యాంకు వద్దకు చేరుకున్న రైతులు తోపులాట లేకుండా యూరియా పొందేందుకు తమ చెప్పులను క్యూలైన్లో పెట్టారు. ఆ తర్వాత వారంతా చెట్టు కింద సేద తీరారు.