NLR: కొడవలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి సుస్థిర లక్ష్యాల పై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి విద్యా రమ విచ్చేశారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికలు తయారు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు.