కోనసీమ: అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని కలెక్టర్ మహేశ్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సమస్యలు తెలియజేయడానికి వచ్చిన దివ్యాంగులు, వృద్ధుల వద్దకు ఆయన నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబందిత అధికారుల ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు.