NDL: బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.