ప్రకాశం: కొండపి మండలం మూగచింతల గ్రామంలో సోమవారం ప్రజా చైతన్య బైక్ యాత్ర సంఘం సభ్యులు గ్రామస్తులతో కలిసి దళితులకు స్మశాన వాటిక కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. స్మశాన వాటిక లేకపోవడంతో దళితులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.