VZM: బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్న నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న డిమాండ్ చేశారు. ఇందిరమ్మ కాలనీలో బుధవారం నిరసన తెలిపారు. భూ కబ్జాలు, నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేస్తున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.