E.G: పీఎం కృషి సంచాయి యోజన నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై చర్చించేందుకు గురువారం దేవరపల్లి నిర్వహించే గ్రామసభలో ఎమ్మెల్యే వెంకటరాజు పాల్గొంటారని ఉప్పులూరు రామారావు తెలిపారు. సర్పంచ్ కడిమి వీరకుమారి అధ్యక్షతన పడమర చెరువు అభివృద్ధి, వాకింగ్ ట్రాక్ నిర్మాణంపై ఈ సభలో నిర్ణయాలు తీసుకోనున్నారు. గ్రామ అభివృద్ధి పనులపై చర్చించే ఈ సభకు ప్రజలు హాజరుకావాలన్నారు.