కోనసీమ: కాట్రేనికోనలో సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ అధ్యక్షతన గ్రామ రెవెన్యూ సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సదస్సులో గ్రామ రెవెన్యూ సదస్సులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సునీల్ కుమార్.. అటవీ శాఖ, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ప్రజల నుంచి రెవెన్యూ పరమైన సమస్యలపై అర్జీలను స్వీకరించారు.