కృష్ణా: ముదినేపల్లి మండలంలోని ఊటుకూరులో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ జె. సుభానీ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. గ్రామంలోని ప్రజలకు భూ సమస్యలు, భూములు మార్పులు, చేర్పులు వంటి సమస్యలు పరిష్కారించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.