BPT: చీరాల నియోజకవర్గం పందిళ్ళపల్లిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం ఉత్సాహంగా సాగింది. యువ నాయకుడు వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.