TPT: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ టికెట్ కౌంటర్ సిబ్బంది కుట్టి బాబును ఆలయ ఈవో పెంచల కిషోర్ సస్పెండ్ చేసినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో భక్తులతో అమర్యాదగా ప్రవర్తించడమే కాకుండా, సరైన సమాధానం చెప్పకుండా అగౌరవపరచారని చెప్పారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.