కృష్ణా: చాట్రాయి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం చాట్రాయి ఎంఈవో 2 బ్రహ్మచారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు.