మన్యం: మక్కువ మండలం కన్నంపేట గ్రామంలో శుక్రవారం పిడుగు పడి నల్ల గోపి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో పిడుగులు పడ్డాయి. అదే సమయంలో పొలంలో ఉన్న నల్ల గోపి, బలగ సాయి అనే ఇద్దరి వ్యక్తులకు పిడుగు పాటు వల్ల గాయాలయ్యాయి.