ఎన్టీఆర్: అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయినా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అన్నారు. నందిగామలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసి పెట్టుబడి సాయం ఇవ్వలేదన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి వినతి పత్రం అందజేశారు.