VSP: నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని పెందుర్తి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్ పిలుపుమేరకు పెందుర్తి ఎక్సైజ్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కల్తీ మద్యం తయారీదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. బెల్ట్ షాపులను రద్దు చేయాలని తెలిపారు.