TG: HYD-విజయవాడ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు కిందకి దిగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు దగ్ధమైంది. HYD నుంచి కందుకూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పిట్టంపల్లి వద్దకు రాగానే బస్సులో పొగలు వ్యాపించాయి. దీంతో బస్సు సిబ్బంది.. ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో కిందికి దిగిపోయారు. బస్సులో 29 మంది ఉన్నారు.