ELR: నూజివీడు డాక్టర్ ఎం.ఆర్. అప్పారావు పీజీ సెంటర్లో శుక్రవారం దివిస్ లేబరేటరీస్ ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ నవీన లావణ్య లత తెలిపారు. ఎంఎస్సీ (కెమిస్ట్రీ), బి.ఫార్మసీ, బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది చక్కని అవకాశమని ఆమె పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.