ELR: నూజివీడులో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 11 రోజులపాటు శ్రీకోట మహిషాసురమర్దిని అమ్మవారు 11 అవతారాల్లో దర్శనమిస్తారు. ఇవాళ అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.