JGL: మెట్పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో విజయదశమి పర్వదినం సందర్భంగా శోభాయమానంగా నిర్వహించిన శమీ పూజ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజయదశమి అనేది చెడుపై మంచి గెలిచిన పర్వదినం, ధర్మం ఎప్పటికీ అధర్మపై గెలుస్తుందన్నారు.