తూ.గో జిల్లాలో యూరియా అవసరానికి సరిపడా అందుబాటులో ఉందని కలెక్టర్ పి. ప్రశాంతి శనివారం తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 2025 ఖరీఫ్ సీజన్లో 21 వేల మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,667 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతుల అవసరాలకు తగిన మోతాదులో స్టాక్ అందుబాటులో ఉందన్నారు.