ప్రకాశం: ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబును నూతన నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించినందుకు వాళ్ళు ఎరిక్షన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలపై దృష్టి సారించాలని వారికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మేడపి, గంటవానిపల్లి, మానేపల్లి నాయకులు పాల్గొన్నారు.