కృష్ణా: ఆ గణనాధుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరులోని 2, 7,15 వార్డుల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాలను అయన సందర్శించారు. అంగరంగ వైభవంగా గణేష్ చతుర్థి ఉత్సవాలు చేయడం ఆనందదాయకమని అన్నారు. ఆ గణనాధుని ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.