CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆలయం వెలుపల భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు, కూలింగ్ ఏర్పాట్లు పరిశీలించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. క్యూలైన్లలో మంచినీరు, ఫ్యాన్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.