ASR: రంపచోడవరం ITDAలో జేసీ స్మరణ్ రాజ్ సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఇందులో వివిధ సమస్యలపై 96 గ్రీవెన్స్ అందాయని తెలిపారు. కొన్ని సమస్యలు అక్కడే పరిష్కరించారు. మిగిలినవాటిని పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పెద్ద గెద్దాడలో రిజర్వాయర్ రిపేర్ చేయాలని, దీని వలన 100 ఎకరాలకు నీరు అందడం లేదని రైతులు వినతి పత్రం అందజేశారు.