KDP: చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని చింతకొమ్మదిన్నె, బుసిరెడ్డిపల్లె గ్రామపంచాయతీల్లో జరుగుతున్న ఉపాధి పనులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ ఆదిశేషారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనులను నాణ్యతగా చేయాలని, సిమెంట్ రోడ్లు, పశువుల షెడ్లు త్వరగా నిర్మించాలని, ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలని సిబ్బందిని ఆదేశించారు.