ELR: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా కొయ్యలగూడెంలో బుధవారం విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, విద్యుత్ ఏడీ కార్యాలయం నుంచి ప్రధాన కూడలి వరకు అవగాహన ప్రదర్శన చేసి పోలీస్ స్టేషన్ కూడలిలో మానవ హారం నిర్వహించారు. కరెంటు ఆదా చేద్దాం, భావితరాలకు భరోసానిద్దాం, విద్యుత్ ఆదా చేద్దాం అని అన్నారు.