ASR: అరకు మండలం సూకూరుగూడ, కొర్రాగూడ గ్రామాల్లో శుక్రవారం అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.