ప్రకాశం: కొమరోలు మండలంలోని రేషన్ దుకాణాలను గురువారం తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణంలోని రికార్డులను పరిశీలించి, స్టాక్ను సమీక్షించారు. రేషన్ తీసుకునేందుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరుకులు అందించాలని దుకాణదారులకు సూచించారు. ఈ తనిఖీలలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.