KRNL: సంకల్భాగాని హరిహర క్షేత్రంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కోరారు. బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి 19వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని ఆయన హరిహర క్షేత్రంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. హరిహర క్షేత్రాన్ని 30సంవత్సరాల క్రితం బ్రాహ్మణుల సహకారంతో నిర్మించామని అన్నారు.