ELR: కృష్ణ కాలువ సుందరీకరణ, కొల్లేరు ప్రజల సమస్య తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయంలో జిల్లా ఇంఛార్జ్ నాదెండ్ల మనోహర్ జిల్లా ఎమ్మెల్యేలుతో శనివారం సమావేశం నిర్వహించారు. కొల్లేరు ప్రజల సమస్యను మానవీయ కోణంతో పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత శాఖాధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.