W.G: ఆచంట మండలం నుంచి నీటి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నాయకులు హరి సత్యనారాయణ, బలుసు సత్యనారాయణ మూర్తులను సోమవారం మార్టేరులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివరామకృష్ణ, ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.