సత్యసాయి: గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త ఆర్యవైశ్య సభ్యులు కొమ్మిశెట్టి నారాయణ మూర్తి సోమవారం స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి వారి ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల కోసం ఆర్థిక సాయంగా రూ. 22 వేలు అందజేశారు.