EV స్కూటర్ల ధరలు పెంచుతున్నట్లు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ప్రకటించింది. అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.3 వేల వరకు పెంపు ఉంటుందని తెలిపింది. జనవరి 1 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఏథర్ సంస్థ 450 సిరీస్లో పెర్ఫార్మెన్స్ స్కూటర్లను, రిజ్తా పేరిట ఫ్యామిలీ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.1,14,546 నుంచి ఉన్నాయి.