VZM: బొండపల్లి మండలంలోని కిండాం అగ్రహారం సర్పంచ్ బుంగ దేవుడు శనివారం మృతి చెందారు. దేవుడుకి తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చికిత్స కోసం విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేవుడు మృతి చెందాడు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు.