SKLM: లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 19 బెంచీలు ఏర్పాటు చేసి 2937 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా శనివారం తెలిపారు. వాటిలో సివిల్ కేసులు 138, క్రిమినల్ 2,694, వాహన ప్రమాదాలకు సంబంధించినవి 43, ప్రీ లిటిగేషన్ కేసులు 62 ఉన్నట్లు వివరించారు.