కర్నూలు: ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సోమవారం నాడు డివైఎస్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఎ నాయకులు నాగేష్ మాట్లాడుతూ.. రోగుల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు, స్టేచైర్స్ ఏర్పాటు చేయాలని, ఒకే బెడ్ మీద ఇద్దరు రోగులు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారు విమర్శించారు.