CTR: పుంగనూరులో బుధవారం విద్యుత్ శాఖ డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. చిత్తూరు జిల్లా ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ హాజరయ్యారు. విద్యుత్ శాఖ తరఫున జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. అలాగే బకాయల పురోగతిపై ఆరా తీశారు. వినియోగదారులకు-నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. EEలు శ్రీనివాసమూర్తి, ఏడీలు పాల్గొన్నారు.