KRNL: ఓర్వకల్లు మండలం MPDO కార్యాలయం నందు ఏపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “రాయితీపై శనగ విత్తనాల పంపిణీ” కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతులకు అవసరమయ్యే ప్రతీ కార్యక్రమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.