నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు శుక్రవారం మహారాష్ట్రలోని షిర్డీలో సాయిబాబాను దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి ఆశీసులు అందుకున్న అనంతరం, సాయినాధుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని వారు తెలిపారు.