ASR: చింతపల్లి మండలంలోని కృష్ణాపురంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎకో టూరిజం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. కృష్ణాపురం పైన్ తోటల్లో శనివారం నుంచి పర్యాటకుల కోసం క్యాంపు ఫైర్ టెంట్లు ఏర్పాటు చేశారు. ఎకో టూరిజం ప్రాజెక్టు వద్ద పచ్చని గార్డెన్, 4 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ పాత్, 25 టెంట్ హట్లు, విద్యుత్ సౌకర్యం, గ్రీజర్లను అధికారులు ఏర్పాటు చేశారు.