W.G: పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెంలో రూ.43.50 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని శనివారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభిస్తారని సర్పంచ్ వెలగల సుగుణ గురువారం తెలిపారు. ఈ భవనాన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై భవన నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. ఎన్నికల అనంతరం రూ.6 లక్షల పంచాయతీ నిధులు వెచ్చించి మైనర్ పనులను పూర్తి చేశారన్నారు.