ప్రకాశం: పామూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినీ వేల్పుల రజినీ జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రథమ బహుమతి సాధించింది. ఈక్రమంలో విద్యార్థినీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.సెప్టెంబర్ మొదటి వారంలో నెల్లూరు జిల్లా కోవూరులో జరిగే పోటీల్లో విద్యార్థినీ పోటీలకు పాల్గొంటారు. ఈ సందర్భంగా శుక్రవారం రజనీని పలువురు అభినందించారు.