కోనసీమ: నూతన సంవత్సరం సందర్భంగా పెన్షన్దారులకు ఒకరోజు ముందుగానే డిసెంబరు 31న పెన్షన్ల పంపిణీకి ఆదేశాలు జారీ చేసినట్టు డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకర ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో 2,38,012 మంది లబ్ధిదారులకు రూ.100.04 కోట్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు.