కడప: పులివెందులలోని స్థానిక అంగన్వాడీ సెంటర్ను శనివారం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తనిఖీ చేశారు. ఆయన విద్యార్థులు అటెండెన్స్ ఖాళీగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అంగన్వాడీ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంత అధ్వాన్నంగా అంగన్వాడీ సెంటర్ను నిర్వహిస్తుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.