ప్రకాశం: గిద్దలూరులో గురువారం పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి జీవనాడి అయినా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 2 వేల కోట్లు కేటాయించాలని ప్రజాసంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తమ నివాసాలు భూములు కోల్పోతున్న ప్రజలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.