NTR: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత “స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన వీధులలో ర్యాలీ ఘనంగా నిర్వహించారు.