ప్రకాశం: ముండ్లమూరు మండలం వేంపాడు వద్ద ఇవాళ అద్దంకి నుంచి వస్తున్నా సిమెంట్ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది డ్రైవర్ను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.