ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయంలో స్వామి వారికి సింధూరం, ఆకుపూజ తదితర పూజలు నిర్వహించారు. స్వామివారికి బంగారం, వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.