అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. బౌలర్లు సత్తా చాటడంతో ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 146 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో జడేజా 4, సిరాజ్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 162, భారత్ 448/5 పరుగులు చేసింది.