ATP: శింగనమల మండలంలోని రైతు భరోసా కేంద్రంలో బుధవారం వేరుశనగ కాయలను ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ… రైతులకు 90 శాతం సబ్సిడీతో నాణ్యమైన వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాలని అధికారులను కోరారు. వేరుశనగ కాయలతో పాటు జొన్న, కంది, ఉలవ విత్తనాలను కూడా ఇవ్వాలన్నారు.